విద్యుత్ షాక్‌తో 2 పాడిగేదెలు మృతి : పరిహారం కోరుతున్న రైతులు

On: April 24, 2026 7:28 PM

విద్యుత్ షాక్‌తో 2 పాడిగేదెలు మృతి : పరిహారం కోరుతున్న రైతులు

విద్యుత్ షాక్‌తో 2 పాడిగేదెలు మృతి : పరిహారం కోరుతున్న రైతులు

ఏటూరునాగారం, ఏప్రిల్ 24, తెలంగాణ జ్యోతి:  మండలంలోని షాపిల్లి గ్రామపంచాయతీలో పంట పొలాల్లో విద్యుత్ తీగలు తెగిపడడంతో రెండు పాడిగేదెలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చీపురు మదనయ్య, రాందేని నరేష్‌లకు చెందిన గేదెలు పొలంలో మేత మేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. అకస్మాత్తుగా తెగిపడిన విద్యుత్ తీగల వల్ల గేదెలు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి భద్రతా చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. అలాగే మృతిచెందిన పశువులకు తక్షణ నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!