గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం, మండపాక జాతీ య రహదారిపై గురువారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని తోలెం పాపారావు (50) మృతి చెందాడు. మండపాక గ్రామానికి చెందిన పాపారావు కాలి నడ కన మండపాక నుండి మైహితాపురం వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుడు పాపారావు సోదరుడు తోలం సమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వాజేడు పోలీస్ ఎస్.ఐ. రుద్ర హరీష్ మీడియాకు  తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment