మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫ్రీజర్ ఏర్పాటు

మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫ్రీజర్ ఏర్పాటు

మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫ్రీజర్ ఏర్పాటు

సంఘానికి పలువురి అభినందనలు

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం నూగూరు మండలం మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శవపేటిక ఏర్పాటు చేశారు. ఫ్రీజర్ ను వెంకటాపురం మేజర్ పంచాయతీ కార్యాలయం వద్ద షెడ్డు నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. సుమారు రూ. 75 వేల విలువైన ఆధునిక ఫ్రీజర్, సుమారు రూ. 35 వేల ఫ్రీజర్ ను భద్ర పరిచే షెడ్డును పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. మున్నూరు కాపు సంఘం వెంకటాపురం మండల శాఖ కమిటి ఆధ్వర్యంలో  విరాలాలు సేకరించి కొనుగోలు చేశారు. వెంకటా పురం, వాజేడు మండలాలకు చెందిన వారు ఎవరైనా వాడుకోని కార్యక్రమాలు అయిపోయిన వెంటనే తిరిగి జాగ్రత్తగా తీసుకు వచ్చి షెడ్ లో ఉంచాలని సంఘం నాయకులు కోరారు. ఫ్రీజర్ లేక పోవడంతో పార్థివ దేహాలను దూరపు బంధువులు వచ్చే వరకు భద్రపరిచేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. మున్నూరు కాపు సంక్షేమ సంఘం పెద్దలు, సభ్యులు కూర్చొని చర్చించి సుమారు లక్ష పదివేల రూపాయలు విలువైన శవపేటికను షెడ్ నిర్మించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. అవసరమైన వారు వెంకటాపురం మేజర్ పంచాయతీ సిబ్బంది తాటి శ్రీను సెల్ నెంబర్ 94 91357661, దేవరకొండ లక్ష్మణ్ సెల్ నెంబర్. 7036393517 లలో సంప్రదించాలన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment