సరస్వతీ పుష్కరాల భద్రతా ఏర్పాట్ల పరిశీలన

సరస్వతీ పుష్కరాల భద్రతా ఏర్పాట్ల పరిశీలన

సరస్వతీ పుష్కరాల భద్రతా ఏర్పాట్ల పరిశీలన

– ఐ జి చంద్రశేఖర్ రెడ్డి

కాటారం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాలేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ నెల 15 నుంచి 26 వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే సరస్వతీపుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు మల్టీ జోన్ ఐజీ ఎస్ చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తో కలిసి కాళేశ్వరంలో దేవాలయ పరిసర ప్రాంతాలు, పార్కింగ్‌ ఏరియాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, భక్తుల క్యూ లైన్ లు, పుష్కర ఘాట్ల వద్ద భద్రతా చర్యలను ఐ జి చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఐ జి మాట్లాడుతూ సరస్వతి పుష్కరాలకు పెద్ద ఎత్తున తెలంగా ణతో పాటు, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరువుతారని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బంది చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న ఐ జి కి దేవాలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, కాటారం, భూపాలపల్లి, డీఎస్పీలు రామ్ మోహన్ రెడ్డి, సంపత్ రావు, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, మహాదేవ్ పూర్ సీఐ రాం చందర్ రావు, కాళేశ్వరం ఎస్ ఐ తమాషా రెడ్డి, జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment