KareGutta | కర్రెగుట్ట, లంకపల్లి అటవిలో పేలిన మందుపాతర

KareGutta | కర్రెగుట్ట, లంకపల్లి అటవిలో పేలిన మందుపాతర

– ముగ్గురు పోలీసులు దుర్మరణం, ఒక ఎస్సైకి గాయాలు

– గాయపడిన ఎస్సైది వరంగల్ పైడిపల్లి

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దు లంకపల్లి అటవిలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ జూనియర్ కమాండోలు మృతిచెందగా, ఒక ఎస్సై గాయపడ్డారు. తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి… ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దు కర్రెగుట్టలపై మావోయిస్టులు పోలీసులను టార్గెట్ చేస్తూ మందుపాతరలు అమర్చారు. ఈ ప్రాంతంలో పోలీసులు 17 రోజులుగా ఆపరేషన్ కగార్ పేరుతో గ్రేహౌండ్స్ దళాలు అడవిని జల్లెడ పడు తున్నాయి. ఈ క్రమంలో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ చేస్తుం డగా గురువారం ఉదయం వాజేడు మండలం సరిహద్దు లో గల చత్తీస్ గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాకు చెందిన లంకపల్లి అటవీ ప్రాంతంలో మందుపాతర పేలింది. కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ కమాండోలు శ్రీధర్, సందీప్, పవణ్ కల్యాణ్ ఈ ఘటనలో మృతి చెందగా, ఆర్ ఎస్పై రణధీర్ గాయపడ్డారు. మందు పాతర పేలుడులో మృతి చెందిన ముగ్గురు జూనియర్ కమాండోల మృతదేహాలను పోలీసులు హెలికాప్టర్ ద్వారా వరంగల్ ఎంజీఎంకు తీసుకు రాగా ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్ధం నిర్వహించారు. ఈ ఘటనలో గాయపడిన ఎస్సై రణధీర్ ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర తదితరులు వరంగల్ కు చేరుకుని మందు పాతర పేలుడులో మృతి చెందిన  కమాండోల మృతదేహాల వద్ద నివాలులు అర్పించారు. ఇదిలా ఉండగా తెలంగాణ – ఛత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దులో చత్తీస్ గడ్ రాష్ట్రంలో బుధవారం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 17 మంది మావోయిస్టులు మరణించినట్లు వార్తలు వెలువెత్తు తున్నాయి.

KareGutta | కర్రెగుట్ట అటవీ లంకపల్లిలో పేలిన మందుపాతర

– నివాళులర్పించిన మంత్రి సీతక్క

మందుపాతర పేలుడులో మృతి చెందిన కమాండోల మృత దేహాలను పోస్టుమార్థం అనంతరం ఎంజీఎం ఆసుపత్రి నుంచి హనుమకొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్ కు తరలించారు. మృత దేహాలకు హెడ్ క్వార్టర్స్ వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

– చంద్రన్న మావోయిస్టుల్లో కీలక నేత..!

కేంద్ర కమిటీ మెంబర్ చంద్రన్న మావోయిస్టుల్లో కీలక నేతగా ఉన్నారు. తెలంగాణకు సంబంధించి నాయకత్వంలో చంద్రన్న నాయకత్వంలో రాష్ట్ర కార్యదర్శి దామోదర్ కీలక భూమిక పోషిస్తున్నారు. కర్రెగుటల్లో ఉన్న గుహలు చంద్రన్న ఆధ్వర్యం లోనే ఆపరేషన్ అంతా సాగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యం లోనే చంద్రన్న కూడా గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మృత్యు వాత చెందినట్లుగా సమాచారం.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment