నాంచారమ్మ జాతరలో సౌకర్యాలు కల్పించాలి 

నాంచారమ్మ జాతరలో సౌకర్యాలు కల్పించాలి 

నాంచారమ్మ జాతరలో సౌకర్యాలు కల్పించాలి 

-తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం 

ములుగు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామంజపురంలో గత 8 సంవత్సరా లుగా  వైభవంగా జరుగుతున్న నాంచారమ్మ జాతరలో సౌకర్యాలను ఏర్పాటు చేయాలని శుక్రవారం తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ దివాకరకు వినతి పత్రం అందించారు. అనంతరం తెలంగాణ ఆదివాసి ఏరుకుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు కేేతిరి బిక్షపతి మాట్లాడుతూ గత 812 సంవత్సరాల క్రితం ఎరుకల నాంచారమ్మ పంచకూటాలయం రామాంజపురం గ్రామంలో పంటపొలాల మధ్య కాకతీయులు నిర్మించారు. నాంచారమ్మ జాతర గత 8 సంవత్సరాల నుండి నాంచారమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ లోకిని రాజు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గత సంవత్సరం జాతరకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరై పూజలు నిర్వహించారని అన్నారు. అక్కడికి వచ్చే భక్తులకు నీటి సౌకర్యం, వైద్యం, భోజన వసతి, రోడ్డు సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ను కోరారు. వారి వెంట తెలంగాణ ఆదివాసి ములుగు జిల్లా ఉపాధ్యక్షులు సల్ల బాబు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment