జన సమర్థ ప్రదేశాల్లో తప్పక సిసి కెమెరాలు ఏర్పాటు

జన సమర్థ ప్రదేశాల్లో తప్పక సిసి కెమెరాలు ఏర్పాటు

– ఎస్పీ కిరణ్ ఖరే సూచన

భూపాలపల్లి, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జిల్లాలో జన సమర్థ ప్రదేశాల్లో తప్పక సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకో వాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్, మెడికల్ కాలేజీ తో పాటు పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా ఎస్పి తనిఖీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ సీసీ కెమెరాలతో నేరాల అదుపుతో పాటు, నేరస్తులను గుర్తించేం దుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.జిల్లా పోలీసు కార్యాలయంలో కమండ్ అండ్ కంట్రోల్ ద్వారా 24 గంటలు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నా రు. ప్రజలు తమ ఇల్లు ,ఆఫీసు, ముఖ్య కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఇలా చేయడం ద్వారా భద్రతా, నిఘా పెంచుకోవచ్చని ఎస్పి అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యం అవరమని ఎస్పి కిరణ్ ఖరే పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment