నేడు బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు

నేడు బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : దేవి శరన్నవరాత్రు ల్లో భాగంగా రోజుకో అవతారంలో అమ్మవారిని అలంకరించి భక్తుల అబీష్టానికి కాటారం మండలం బొప్పారం గ్రామంలో అమ్మవారి ఆలయం అంకురార్పణ చేస్తున్నారు. ఈ నేపథ్యం లో గురువారం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనం జరుగుతుందని పురోహితులు రామా చార్యులు తెలిపారు. ఈ ప్రాంతంలోని ప్రజలు, భక్తులు అమ్మ వారిని దర్శించుకొని, అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆయన కోరారు. అమ్మవారిని కోరుకున్న వారికి, కోరిన కోరికలు తీర్చే వర ప్రధానిగా వర్ధిల్లుతున్న అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment