గ్యారెంటీ లేని ఆరు గ్యారెంటీలు

గ్యారెంటీ లేని ఆరు గ్యారెంటీలు
– ప్రజా పాలనంటూ ప్రజలను పూర్తిగా మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
– అబద్దాల కాంగ్రెస్ ప్రభుత్వానికి తొందర్లో ప్రజలె బుద్ధి చెబుతారు
– బీఎస్పీ వెంకటాపురం మండల పార్టీ అధ్యక్షుడు సొల్లేటిగణేష్ చారి
తెలంగాణజ్యోతి, నూగూరు వెంకటాపురం: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తుపాకి రాముడి మాటలు, గ్యారంటీ లేని ఆరు గ్యారెంటీల హామీలతో అటుకెక్కి కూర్చుని ఏ ఒక్కటి కూడా నేటి వరకు అమలు చేయలేదని, రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వాత పెట్టడం ఖాయమని ములుగు జిల్లా బీఎస్పీ నాయకులు గణేష్ చారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం స్థానికంగా జరిగిన సమావేశంలో ఆయన మాటలు పాల్గొని మాట్లా డుతూ కాంగ్రేస్ ప్రభుత్వ ఆదరణ పూర్తిగా కోల్పోయిందని, గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన తప్పిదాలే ఇంకా రేవంత్ రెడ్డి కూడా అదే పంధాలో నడుస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ , టిఆర్ఎస్ రెండు పార్టీలను గ్రామాల్లో ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఎన్నిక లు వస్తేనే గ్రామాల ప్రజలు గుర్తుకొస్తున్నారా మీకు అని ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. వెంకటాపురం మండల ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలని, ఈసారి జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలకు తప్పకుండా ఒటమి చెందుతారని జోస్యం చెప్పారు. సమాజమంతా కూడా బహుజన సమాజ్ పార్టీ (బీ.ఎస్పీ) సిద్ధాంతాల పట్ల అవగా హనతో ఉన్నారని, అగ్రవర్ణ రాజకీయాలను బొంద పెట్టే రోజు, జరగబోయే స్థానిక ఎన్నికల్లో జరుగుతుందని ధ్వజమెత్తారు. పేదల పార్టీ, బహుజనుల పార్టీ, బహుజన సమాజ్ పార్టీ అందరం ఏకమై స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని, వెంకటాపురం ప్రజలకు బిఎస్పి అధ్యక్షులు సొల్లేటి గణేష్ చారి ప్రజలకు పిలుపునిచ్చారు. పది రోజుల క్రితం జరిగిన గ్రామ సభల్లో ప్రభుత్వ అధికారులు చెప్పినటువంటి మాటలు పచ్చి బూటకం ప్రభుత్వ అధికారులు కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు ప్రజలకు సేవకులు అని , అనే విషయాన్ని అధికారులకు ఆయన గుర్తు చేశారు. కేవలం స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ స్థానిక పంచాయితీ లల్లో గెలవడం కోసం మాత్రమే, ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తున్నాం అని అంటున్నారు. ఇంకా రాని వారు ఉంటే దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ అని అసత్యపు ప్రచారం చేస్తూ ప్రజలను ఇంకా మోసగించే ప్రయత్నాలు మాను కోవాలని హితవు పలికారు. కానీ ప్రజలు ఎవరు మీ మాయ మాటలను నమ్మరని, బిఎస్పీ నేత సొల్లేటి గణేష్ చారి మండిపడ్డారు. అసలైన లబ్ధిదారులు కాకుండా పథకాలు ఉన్నవారికి ఇస్తే అసలైన లబ్ధిదారులకి బీఎస్పీ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుందని అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీటంలో ప్రతిపక్షం పూర్తిగా విపలమైంది. ప్రజలకు బిఎస్పి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ప్రజల పక్షాన పోరాడటం బహుజన్ సమాజ్ పార్టీ కి కొత్త కాదు నిరంతరం అని అన్నారు. ప్రజలకు అందుబాటులో బీఎస్పీ నాయకులు, బిఎస్పి పార్టీ అందుబాటులో ఉంటుందని తెలిపారు.