ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సర్పంచ్ల విద్యా వర్క్షాప్
మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్
పెద్దవంగర, మే13,తెలంగాణజ్యోతి:తెలంగాణప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సర్పంచ్లకు విద్యా వర్క్షాప్ నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 17 వరకు విద్యా వారోత్సవాలు కొనసాగనున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో గ్రామ సర్పంచ్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మండలంలోని సర్పంచ్లు అందరూ హాజరై విద్యా వర్క్షాప్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.









