పాలెం ప్రాజెక్టుకు జలకళ.
అదనపు నీటిని గోదావరిలోకి విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం పాలెం ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం గురువారం నాటికి చేరుకొని నిండిపోవడంతో, ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి వేసి వేసీ అదనపు నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. సుమారు పదివేల ఎకరాలకు పైగా సాగునీటి ఆయకట్టు విస్తీర్ణం కలిగిన పాలెం ప్రాజెక్టు గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల నుండి ప్రాజెక్టు రిజర్వాయర్కు వాటర్ ఇ న్ ఫ్లో తగ్గిపోవడంతో రిజర్వాయర్లో నీటిమట్టం క్రమంగా అడుగంటి పోయింది. అలాగే గత రబీ సీజన్లో ప్రాజెక్టు నీటిని నమ్ముకుని సుమారు 4,000 ఎకరాలకు పైగా వరి, మిర్చి మొక్కజొన్న ఇతర పంటలు వేసి , రైతాంగం సాగు చేసి నీటి సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు. అలాగే గత ఖరీఫ్ సీజన్ లో కూడా ఆయకట్టు కు పూర్తిస్థాయి సాగునీరు అందలేదు .ఈ ఏడాది రిజర్వాయర్ లో రికార్డు స్థాయిలో నీటిమట్టం పడిపోవడంతో, యాసంగి పంటలు ఎండిపోయాయి .గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సతీష్ గడ్ సరిహద్దులోని వాగులు, వంకలు, కొండలపై నుండి అటవీ ప్రాంతాలు నుండి కొండ వాగులు ప్రాజెక్టు క్యాచ్ మెంటు ఏరియా నుఃడి రిజర్వాయర్కు రికార్డు స్తాఇలో నీరు చేరికతో ఒక్కసారిగా పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోవడంతో ,ప్రాజెక్టుకు చెందిన నాలుగు గేట్లను ఇంజనీరింగ్ అధికారులు ఎత్తివేశారు. అలాగే భారీ వర్షాలకు అనేక వాగులు, వంకలు, చెరువులు, కుంటలు నిండిపో యాయి. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది.