ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభ విజయవంతం 

On: April 3, 2026 12:48 PM

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభ విజయవంతం 

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభ విజయవంతం 

గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు :  సర్పంచ్ గట్టి సుదర్శన్

ములుగు, ఏప్రిల్3, తెలంగాణ జ్యోతి: ములుగు మండలం కొత్తూరు గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ గ్రామసభ ఉత్సాహ భరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసిందని గ్రామ సర్పంచ్ గట్టి సుదర్శన్ తెలిపారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా నిర్వహించిన ఈ సభలో గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని తమ సమస్యలు, విన్నపా లను అధికారుల దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేయడంలో సహకరించిన గ్రామ ప్రజలకు, వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే సహకారం కొనసాగించాలని, సమిష్టి కృషితో కొత్తూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!