వెంకటాపురం గ్రామపంచాయతీ వేలం వాయిదా
వెంకటాపురం నూగూరు, మార్చి 31, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీకి సంబంధించిన 2026-27 ఆర్థికసంవత్సరానికి మంగళవారం నిర్వహించిన వేలం పాటలు వాయిదా పడ్డాయి. సర్పంచ్ తాటి సరస్వతి అధ్యక్షతన నిర్వహించిన ఈ వేలంలో పలువురు పాటదారులు పాల్గొన్నారు. అయితే ప్రభుత్వ మద్దతు ధర రాకపోవడంతో వేలం ప్రక్రియను నిలిపివేసినట్లు గ్రామపంచాయతీ అధికారులు వెల్లడించారు. తదుపరి వేలం తేదీలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి జమ్మిలాల్, పంచాయతీ కార్యదర్శి గడ్డం కార్తీక్, ఉప సర్పంచ్ సర్పద్దిన్ తదితరులు పాల్గొన్నారు.









