అక్రమ సంబంధం హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
కాటారం, జనవరి 8, (తెలంగాణ జ్యోతి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధిలో నమోదైన అక్రమ సంబంధం హత్య కేసులో గురువారం ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి రమేష్ బాబు తుది తీర్పును ఇచ్చారు. కాటారం మండలం విలసాగర్ గ్రామానికి చెందిన నిందితుడు రాదండి రవి (31) కి దోషిగా జీవిత ఖైదీ కారాగార శిక్షతో పాటు రూ.10 వేల 500 జరిమానా విధిం చారు. అదే గ్రామానికి చెందిన బోడ పూజ మధ్య కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో నిందితుడు పూజ వద్ద నుండి సుమారు రూ.5 లక్షల నగదు మరియు బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. అనంతరం ఆమె వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో, నిందితుడు ఆమెను హతమార్చాలని పథకం రచించాడు.అందులో భాగంగా 12-03-2019 రాత్రి సుమారు 10.00 గంటల సమయంలో పూజ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన పూజను హాస్పిటల్కు తరలించగా, చికిత్స పొందుతూ 13-03-2019న మృతి చెందింది. ఈ హత్య కేసును పోలీసులు శాస్త్రీయంగా దర్యాప్తు చేసి పక్కా ఆధారాలతో చార్జ్షీట్ దాఖలు చేయగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ ఎదులాపురం శ్రీనివాస్ సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో నిందితుడికి శిక్ష ఖరారైంది.ఈ కేసు దర్యాప్తులో సీఐలు హథిరాం, కే. శివప్రసాద్, ఎస్ఐ నరేష్, లైజైనింగ్ ఆఫీసర్ వెంకన్న, సీడీఓ రమేష్ లు కీలకంగా పనిచేసినందుకు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపిఎస్ గారు వారిని అభినందించారు ఈ తీర్పుతో నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని పోలీసులు స్పష్టం చేశారు.






