వాజేడు మండలంలో డయాలసిస్ సెంటర్కు స్థల పరిశీలన
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 17, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు దిశగా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. గోపాలరావు, జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయకర్త (డిసిహెచ్ఎస్) డా. జగదీష్ ఆకస్మికంగా పేరూరు పీహెచ్సీని సందర్శించి డయాలసిస్ సెంటర్కు అనువైన స్థలం, వసతులపై పరిశీలన నిర్వహించారు. కేంద్రంలో అమలవుతున్న వైద్య సేవలను సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.









