మాల న్యాయ వేదిక జిల్లా అధ్యక్షుడిగా గంపల శివకుమార్
సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలి: బాణాల ప్రభాకర్
ములుగు, మే 11, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా మాల న్యాయ వేదిక జిల్లా అధ్యక్షుడిగా గంపల శివకుమార్ను నియమిస్తూ సామాజిక న్యాయ వేదిక ములుగు జిల్లా అధ్యక్షులు బాణాల ప్రభాకర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో మాలలకు సామాజిక న్యాయం జరగాలని, జనాభాకు తగిన ప్రాతినిధ్యం నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల్లో కల్పించకపోవడం బాధాకరమని అన్నారు. ములుగు జిల్లాలో సామాజిక న్యాయం సాధన కోసం “మనమెంత మంది మో మనకంత వాటా” అనే నినాదంతో ఐక్యంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.









