వెంకటాపురంలో నల్ల రిబ్బన్లతో ప్రభుత్వ ఉద్యోగుల నిరసన
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 17, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిషత్తు కార్యాలయం ఎదుట శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, టైపిస్ట్, కార్యాలయ సిబ్బంది మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) అమలు చేయాలని డిమాండ్ చేశారు. నల్ల రిబ్బన్లు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు.









