ములుగు జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు భారీగా బదిలీ
ములుగు, మార్చి 26 తెలంగాణ జ్యోతి : జిల్లా పంచాయతీ విభాగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం 71 మంది పంచాయతీ కార్యదర్శులను డిప్యూటేషన్పై ఇతర గ్రామాలకు బదిలీ చేశారు. కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశాలతో ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. సంబంధిత కార్యదర్శులు వెంటనే తమ కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని సూచించారు. ఈ చర్యతో గ్రామస్థాయిలో పాలన మరింత సమర్థవంతంగా కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు.








