కాసిందేవిపేటలో పారిశుద్ధ్యానికి కలెక్టర్ ప్రశంసలు
ములుగు, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): గ్రామాన్ని శుభ్రంగా ఉంచడం లో సర్పంచ్ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది కృషి అభినందనీ యమని జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. మంగళవారం కాసిందేవిపేట గ్రామ పంచాయతీని సందర్శించిన కలెక్టర్, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వాంకుడోత్ నిరోషా అమర్ సింగ్ ఆధ్వర్యంలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎంతో సమర్థవంతంగా సాగుతు న్నాయని తెలిపారు. గ్రామంలో పరిశుభ్రతను కాపాడడంలో సర్పంచ్ పాత్ర కీలకమని, గ్రామపంచాయతీ సిబ్బంది పనితీరు కూడా భేష్గా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సంతోష్, ఏఈఓ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.






