Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

మేడారంలో బ్యాంకు ఏర్పాటు చేయాలి

On: March 17, 2026 6:23 PM

మేడారంలో బ్యాంకు ఏర్పాటు చేయాలి

మేడారంలో బ్యాంకు ఏర్పాటు చేయాలి

– దారావత్ దేవా నాయక్ డిమాండ్

తాడ్వాయి, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): మేడారం ప్రాంత ప్రజలకు సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వ బ్యాంకు బ్రాంచ్‌ను ఏర్పాటు చేయాలని టీడీపీ ములుగు నియోజకవర్గం ఇంచార్జి దారావత్ దేవా నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మేడారం లో మాట్లాడుతూ, బ్యాంకు ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల 18 గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం బయక్కపేట, కాల్వపల్లి, నార్లపూర్, వెంగ్లాపూర్, గోనేపల్లి గ్రామాల ప్రజలు సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని గోవిందరావుపేటకు వెళ్లాల్సి వస్తోందని, కన్నెపల్లి, కొత్తూరు, ఊరట్టం, మేడారం గ్రామాల ప్రజలు తాడ్వాయి వెళ్లడం కూడా తీవ్ర ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. మేడారం ప్రత్యేక మండలంగా మారితే భవిష్యత్తులో బ్యాంకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అప్పటి వరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణమే బ్యాంకు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంపై త్వరలో ములుగు కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీలకు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. మేడారం లో బ్యాంకు ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు, మహిళలు, యువత కలసి స్పందించి సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!