Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

రూ.5 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

On: March 17, 2026 12:31 PM

సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

రూ.5 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

అయ్యవారిపేటలో ఉపాధి హామీ నిధులతో పనుల ప్రారంభం

వెంకటాపురం నూగూరు, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వాజేడు మండలం అయ్యవారిపేట గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించనున్న సిమెంట్ రోడ్డు పనులకు మంగళవారం శంకుస్థాపన నిర్వహించారు. స్థానిక సర్పంచ్ మడకం బెనిని కొబ్బరికాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం నిధుల నుంచి సుమారు రూ.5 లక్షల వ్యయంతో ఈ సీసీ రోడ్డును నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్, ఉప సర్పంచ్ కాలేశ్వరపు సర్వేశ్వరరావు, సద్దన్నపు నరసింహ చారి, తెల్లం బుల్లేశ్వరరావు, గోగు నరసింహారావు, తుండే రాజబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!