ఒకే రోజు తల్లీ–కూతుళ్ల పుట్టినరోజు సంబరం
అరుదైన సంఘటనగా ఆకట్టుకున్న వేడుక
భూపాలపల్లి, మార్చి17, తెలంగాణ జ్యోతి : గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో తల్లి–కూతుళ్లు ఒకే రోజున పుట్టినరోజు జరుపుకోవడం అరుదైన సంఘటనగా నిలిచింది. ఎడ్ల మాధవి 1991 మార్చి 17న జన్మించగా, ఆమె కూతురు ఎడ్ల రుచిస్వి 2010 మార్చి 17న జన్మించింది. ఈ సందర్భంగా ఇద్దరూ ఒకే వేదికపై జన్మదిన వేడుకలు జరుపుకోవడంతో బంధువులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. తల్లి–కూతుళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కుటుంబ సభ్యులు సందడి చేయడంతో వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.






