ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ
ఏటూరునాగారం, జనవరి 23 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా ఏటూరునాగారంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) వాలంటీర్ విద్యార్థినీలు ఓటు ప్రాముఖ్యతపై ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో నినాదాల ద్వారా ప్రజలకు ఓటు హక్కు విలువను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బి. ప్రమీల, వైస్ ప్రిన్సిపల్ సృజన, ఏవో సమ్మయ్యతో పాటు అధ్యాపకులు, విద్యార్థినీలు పాల్గొన్నారు.






