ముప్పనపల్లి పాఠశాల ప్రాంగణంలో పిచ్చి మొక్కల తొలగింపు
కన్నాయిగూడెం, జనవరి 19 (తెలంగాణ జ్యోతి):ముప్పనపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం చుట్టూ పిచ్చి మొక్కలు అధికంగా పెరిగి విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని పాఠశాల హెడ్మాస్టర్ వేణుగోపాల్ ఉప సర్పంచ్ చీదరి సుమన్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన డోజర్, జేసీబీ ఏర్పాటు చేసి పాఠశాల పరిసరాల్లోని పిచ్చి మొక్కలను తొలగించారు. దీంతో పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా మారి విద్యార్థులకు అనుకూల వాతావరణం ఏర్పడింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.






