నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
కన్నాయిగూడెం, జనవరి 1, తెలంగాణ జ్యోతి : నూతన సంవత్సరం సందర్భంగా ప్రజాభవన్లో రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్కను కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రికి ఫోటో ఫ్రేమ్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు అప్సర్ పాషా, జిల్లా స్థాయి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






