బుట్టాయిగూడెంలో మంత్రి సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం
కన్నాయిగూడెం, జనవరి 1 (తెలంగాణ జ్యోతి): నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామంలో మండల కాంగ్రెస్ ఇంచార్జి జాడి రాంబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి దనసరి సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రామాలయ గుడి, లక్ష్మీ దేవర గుడి, రాజన్నపేట క్రైస్తవ మందిరం, సమ్మక్క–సారక్క ప్రహరీ గోడల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినం దుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






