కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబుచే సర్పంచులకు సన్మానం
కాటారం, డిసెంబర్ 23, తెలంగాణ జ్యోతి : కాటారం, మాహముత్తారం, మల్హర్ రావు, మహదేవ్ పూర్, పలిమెల ఐదు మండలాల సర్పంచ్లకు నాయకులకు అభినందన సభ చేసినట్లు మంత్రి పిఏ ఆకుల చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాటారం సమీపం లోని AVS, ఏసీ ఫంక్షన్ హాల్ లోఉదయం 9:00 గంటలకు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ లకు, పాలకవర్గానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి 5 మండలాల నూతన సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచ్ అభ్యర్థులు, సీనియర్ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.






