మేడారం అభివృద్ధి పనుల పర్యవేక్షణలో రాష్ట్ర మంత్రులు
ములుగు, డిసెంబర్23,తెలంగాణజ్యోతి: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దనసరి అనసూయ సీతక్కలు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రులకు ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి సాళువ కప్పి ఘనంగా స్వాగతం పలికారు. మేడారం అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై మంత్రులు అధికారులతో సమీక్షించనున్నారు.






