బిర్యానీ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన పొదెం
వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 14 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య ముఖ్యఅతిథిగా హాజరై మస్తాన్ బిర్యానీ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు రావడం అభినంద నీయమని, ఇలాంటి వ్యాపార సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల పెంపుకు దోహదపడతాయని పేర్కొన్నారు. నాణ్యమైన ఆహారం, మెరుగైన సేవలతో వినియోగదారుల సంతృప్తికి ప్రాధాన్యం ఇవ్వాలని రెస్టారెంట్ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






