మహిళపై గొడ్డలితో హత్యాయత్నం

మహిళపై గొడ్డలితో హత్యాయత్నం

మహిళపై గొడ్డలితో హత్యాయత్నం

– ప్రభుత్వ ఆసుపత్రిలో కోరుకుంటున్న బాధిత మహిళ

కాటారం, తెలంగాణ జ్యోతి : కాటారం పోలీస్ స్టేషన్ సమీపం లో మహిళపై హత్యాయత్నం చేసిన సంఘటన సంచలనంగా మారింది. కాటారం సబ్ ఇన్స్పెక్టర్ మ్యాకల అభినవ్ తెలిపిన వివరాల ప్రకారం… కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరంపల్లి గ్రామానికి చెందిన మారుపాక సారయ్య గతంలో హత్యకు గురయ్యారు. కేసులో నిందితురాలు వరుసకు మరద లు మారుపాక లక్ష్మి గారెపెళ్లి గ్రామానికి వచ్చిన సమాచారం తెలుసుకొని హత్యకు గురైన సారయ్య కుమారుడు మారుపాక అంజి కాటారం – భూపాలపల్లి జాతీయ రహదారిపై సూపర్ మార్కెట్ సమీపంలో గొడ్డలితో లక్ష్మిపై దాడి చేశారు. నేలపై నుండి మహిళను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లడం సంచలనంగా మారింది. ఈ సంఘటన చూసిన పలువురు మహిళను రక్షించేం దుకు కృషి చేశారు. అదే సమయంలో నిందితుడిని పట్టుకు న్నారు. మాచర్ల లక్ష్మి తలకు కుడివైపున గొడ్డలితో గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సరైన సమయంలో వైద్య సహాయం అందించారు. ఐదు కుట్లు పడ్డాయని ప్రాణాపాయం నుండి బయటపడినట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిందితుడు మారుపాక అంజిని కస్టడీలోకి తీసుకున్నట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాటారం సబ్ ఇన్స్పెక్టర్ అభినవ్ తెలిపారు.

————————————-

విలేకరులు కావలెను. వివరాలకు 9848552224 నంబర్లో సంప్రదించగలరు. 

————————————–

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment