వెంకటాపురం మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 7వ తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారని వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ బుదవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.