బహిరంగ సభకు తరలిన గులాబీ దండు
– వరంగల్ సభకు భారీగా తరలిన గులాబీ శ్రేణులు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : వరంగల్ లో జరిగే భారీ బహిరంగ సభకు ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల నుండి వందలాది వాహనాలు, గులాబి జండాలతో ర్యాలీగా బయలుదేరి తరలి వెళ్లగా వెంకటాపురం పట్టణాన్ని గులాబీ తోరణాలతో అలంకరించారు. కార్లతో పాటు, ఆర్టీసీ అద్దె బస్సులతో భారీగా ఆదివారం ఉదయం వెంకటా పురం పట్టణంలోని శివాలయం వద్ద నుండి వాహనాల శ్రేణి ఊరేగింపుగా వాహనాల ర్యాలీ ప్రారంభమైంది. బస్టాండ్ సెంటర్లో ని పార్టీ దిమ్మ వద్ద పార్టీ జెండాని ఎగరవేసి కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ 18 పంచాయతీల నుండి గులాబీ దండుగా వందలాది వాహనాల్లో చలో వరంగల్ అంటూ నినాదాలు, వాహనాలతో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గంపా రాంబాబు, సీనియర్ నాయ కులు గుడవర్తి నరసింహమూర్తి, డర్రా దామోదర్, ముడుంబా శ్రీనివాసు, వేల్పూరి లక్ష్మీనారాయణ, జాగర శాంత మూర్తి, జే. శివాజి, మాజి సర్పంచి పూజరి ఆది లక్ష్మి, జానకమ్మ, పెను మత్స మాదురి, పలువురు నాయకులు, కార్యకర్తలు మహిళలు వందల సంఖ్యలో చలో వరంగల్ రజతోత్సవ సభకు తరలారు.