Miss India contest | రామప్ప శిల్ప సంపద అద్భుతం

Miss India contest | రామప్ప శిల్ప సంపద అద్భుతం

Miss India contest | రామప్ప శిల్ప సంపద అద్భుతం

– మిస్ ఇండియా కాంటెస్ట్ నందిని గుప్తా

వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని శనివారం మిస్ ఇండియా నందినిగుప్తా సందర్శిం చారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా టూరిజం అధికారి శివాజీ మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాసరావు పుష్పగుచ్చాలు అందజేసి వారికి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు హరిష్ శర్మ, ఉమా శంకర్ లు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ శిల్పకళా ప్రాముఖ్యతను టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. శిల్ప కళలు, సరిగమలు, నీటిలో తేలియాడే ఇటుకలను చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం మాట్లాడుతూ.. రామప్ప చాలా గొప్పగా ఉందని, శిల్ప సంపద అద్భుతంగా ఉందని, మరోసారి రామప్పను సందర్శిస్తానని అన్నారు. వారి వెంట తహసిల్దార్ గిరిబాబు, ఎస్సై సతీష్ టూరిజం, పోలీస్, పురావస్తు, రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment