టోల్ ప్లాజా అక్రమ వసూళ్లను అరికట్టాలి
– బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు రామిళ్ల కిరణ్
కాటారం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మేడిపల్లి జాతీయ రహదారి 353 సి పై గల టోల్ ప్లాజా నిర్వాహకులు వాహనాదారుల నుండి అక్రమ వసూళ్లు చేస్తున్నారని అలాంటి అక్రమ వసూళ్లను వెంటనే అరికట్టాలని కాటారం బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు రామిళ్ల కిరణ్ డిమాండ్ చేశారు. మేడిపల్లి టోల్ ప్లాజా నుండీ వెళ్తున్న వాహనాలకు కట్ అయినా అమౌంట్ తర్వాత ఆ వెనువెంటనే అదే ఛార్జీలని కట్ చేస్తూ వాహన దారులను టోల్ ప్లాజా నిర్వాహకులు బురిడీ కొడుతున్నారని కిరణ్ ఆరోపించారు. అదే రహదారికి సంబంధించి రోడ్డు మెయింటెనెన్స్ కింద రోడ్లు బాగు చేయాల్సింది ఉండగా అలాంటివేం పట్టించుకోకపోవడంతో రోడ్లు అద్వాన్నంగా తయారయ్యాయని ఆరోపించారు. టోల్ ప్లాజా వద్ద కనీస సౌకర్యాలైన మంచినీటి సదుపాయం, టాయిలెట్స్ లేక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడిం చారు. కాటారం సబ్ డివిజన్ లోని ఐదు మండలాల ప్రాంత ప్రజల సొమ్మును వసూళ్లు చేస్తున్న టోల్ ప్లాజా నిర్వాహకులు బాధ్యతాయుతంగా ఉండాల్సింది ఉండగా వీళ్ళతో ఏమవు తుందనే అహంతో అసలే పట్టించుకోవట్లేదని కిరణ్ ఆరోపిం చారు. ఇప్పటికైనా సంబంధిత నేషనల్ హైవే అథారిటీ అధికా రులు, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి అధిక వసూళ్ల పర్వాన్ని అరికట్టాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామ న్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు రామిళ్ల రాజబాపు పాల్గొన్నారు.