మే 5 న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలి
వెంకటాపురంనూగూరు, తెలంగాణ జ్యోతి : షెడ్యూల్ ప్రాంత భూమి చట్టాలు, నిబంధనలు, హక్కులు అమలు కొరకు ఏఎస్పి అధ్యక్షులు పూనెం శ్రీనివాస్ ఆదేశాలపై ములుగు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్, కో కన్వీనర్ టింగ భుచ్చయ్య, కుర్సం శివశంకర్, తాటి రామచందర్, పాయం భారతిలు పిలుపు నిచ్చారు.ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పూనెం శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ఐదవ షెడ్యూల్ భూభాగంలో నివాసం ఉంటున్న ఆదివా సులు ఏజెన్సీ ప్రాంతాలల్లో ప్రవేశించిన గిరిజనేతరులు, 1970 సంవత్సర తర్వాత వలస వచ్చిన గిరిజనేతరుల కారణంగా ఎన్నో ఏళ్లుగా ఆదివాసులు దోపిడీకి, అన్యాయానికి గురవుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాలకు వర్తింప జేసిన న్యాయ పాలన, రెవిన్యూ చట్టాలు, నిబంధనలు, హక్కులు, భూస్వాధీనానికి అక్రమ మార్గాలకు అడ్డుకట్ట వేయలేక పోయారని మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు రాను, రాను ఆర్థిక పరిస్థితి దిగజారిపోతూ ఉంటే గిరిజనేతరులు పై పైకి ఆర్థికంగా, రాజకీయంగా ఎగబాకుతూ తమ ఆధిపత్యాన్ని పెంచి పోషించుకుంటూ ఉన్నారని ధ్వజ మెత్తారు. గిరిజనుల భూమిపై వారికున్న సహజ హక్కు నిర్వీర్యం కాకూడదనే ఉద్దేశంతోనే బ్రిటిష్ హయంలో నుండి చట్టాల రూపకల్పన జరిగిందన్నారు. ఆదివాసి చట్టాలు, హక్కుల అమలు కొరకు 5 మే 2025 న ములుగు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ ప్రోగ్రాం అనంతరం ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా నూతన కమిటీ ఉంటుందని అన్నారు. రాష్ట్ర కమిటీ, రాష్ట్ర అధ్యక్షులు పూనెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా నూతన కమిటీ ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పూనెం శ్రీనివాస్, ఆదివాసి సంక్షేమ పరిషత్ దనుసరి రాజేష్, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ, ఆదివాసీ సంక్షేమ పరిషత్, సనప విష్ణు, రాష్ట్ర కార్యదర్శి, బోదె బోయిన స్వాతి ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ,ఇర్ప రాజేష్ రాష్ట్ర కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.