గిరిజనేతరుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను రెవిన్యూ అధికారులు స్వాధీన పరచుకోవాలి

గిరిజనేతరుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను రెవిన్యూ అధికారులు స్వాధీన పరచుకోవాలి

గిరిజనేతరుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను రెవిన్యూ అధికారులు స్వాధీన పరచుకోవాలి

– టి బి ఏ ఎస్ మండల అధ్యక్షులు తాటి లక్ష్మణరావు డిమాండ్

వెంకటాపురంనూగూరు, తెలంగాణజ్యోతి :తెలంగాణ భూమి పుత్ర ఆదివాసి సంఘం వెంకటాపురం కార్యాలయంలో సోమ వారం కోరం ప్రసాద్ అధ్యక్షతన సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా టీబీఏఎస్ మండల అధ్యక్షులు తాటి లక్ష్మణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం వెంకటాపురం మండలంలో వీరభద్రవరం జడ్ అంకన్న గూడెం జడ్ రెవిన్యూ గ్రామాల్లో ప్రభుత్వ భూములను కొందరు గిరిజనేతరులు కబ్జా చేసి బినామీ పేర్లతో టి అక్రమ పట్టాలను పొందారని వాటిపై విచారించి అక్రమ పట్టాలను రద్దు చేయాలని ఆయన రెవిన్యూ అధికారులను డిమాండ్ చేశారు. అలాగే వెంకటాపురం జెడ్ సర్వేనెంబర్ 69,  వాడగూడెం సర్వే నెంబర్ 44 లో 1/70 చట్టాన్ని కి తూట్లు పొడిచి గిరిజనేతరులు గుడిసె లేస్తుంటే రెవిన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా ద్వంద వైఖరి వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆదివాసి చట్టాలను ఏజెన్సీ ప్రాంత భూ హక్కులను పరిరక్షించాల్సిన రెవిన్యూ యంత్రాంగం పరోక్షంగా నీరు కారుస్తుందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా అధికా రులకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే గిరిజనేతరులు చేస్తున్న ప్రభుత్వ భూముల కబ్జాలను అడ్డుకొని గుడిసెలను తొలగించి అట్టి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి పూనెం నాగరాజ్, తాటి శ్రీనాథ్, కోరం ప్రసాద్, పూనెం పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment