చిడెం సాయి ప్రకాష్ చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయి
– వెంకటాపురం సి.ఐ బి. కుమార్
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : చేయూత స్వంచంద సేవా సంస్థ వ్యవస్థాపకులు చిడెం సాయి ప్రకాష్ సమాజానికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్ అన్నారు. ఆదివారం సాయంత్రం వెంకటాపురం మండల కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథిగృహం ఆవరణలో సాయి ప్రకాష్ సంతాప సభ నిర్వహించారు. ఈ సభకు పలువురు ప్రముఖులు, రాజకీయ పార్టీలు నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి. ఐ.బి. కుమార్ సంతాప సభలో మాట్లాడుతూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు, అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని చిన్న వయసులోనే ప్రజా సేవకు అంకితమైనారని సాయి ప్రకాష్ చేసీన సేవలను కొనియాడారు. గత ఏప్రిల్ 15వ తేదీన హనుమకొండకు తన బంధువులను వైద్యశాలకు తీసుకువెళ్లి కార్ తో సహా మిస్ అయిన సాయి ప్రకాష్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ సందర్భంగా సంతాప సభ ఏర్ఫటు చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షులు, చిడెం మోహన్ రావు, వెంకటాపురం మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, సిపిఐ ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు, న్యాయవాది చిడెం రవికుమార్, లతో పాటు పలువురు పాల్గొని సంతాప సభలో సాయి ప్రకాష్ చేసిన సేవలను కొనియాడారు.