ఘనంగా దత్తాత్రేయ ఆలయ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా దత్తాత్రేయ ఆలయ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా దత్తాత్రేయ ఆలయ వార్షికోత్సవ వేడుకలు

– ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

కాటారం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్వగ్రామమైన ధన్వాడలో వారి కుటుంబంచే నిర్మితమైన శ్రీ దత్తాత్రేయ దేవాలయ మూడవ వార్షికోత్సవ వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి.  పురోహి తులు శ్రీరాంభట్ల కృష్ణమోహన్ శర్మ ఆధ్వర్యంలో 32 మంది వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో మహోత్తరమైన పూజలు, వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు మెమెంటో ఇచ్చి శాలువాతో సన్మానం చేశారు. ఆలయ మూడవ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం ఉదయం దత్తాత్రేయు ని దేవాలయంలో పుణ్యాహవాచనము గణపతి పూజ 54 ప్రత్యేక కలశములు ఏర్పాటు చేసి మూలవిరాట్ దత్తాత్రేయ స్వామికి అభిషేకము, పంచామృతాభిషేకము, పుష్పార్చన, దత్త హోమం నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రత్యేకంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు దత్తాత్రేయుని దైవ దర్శనం చేసుకొన్నారు. భక్తులకు మహా అన్నప్రసాద వితరణ నిర్వహిం చారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమకు మూడు సౌకర్యం కోసం గృహాలు మంజూరు చేయాలని ఇతర సమస్యల పైన ప్రజలు మంత్రి శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి చేశారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ దశలవారీగా ఇల్లు లేని వారందరికీ ఇళ్ల నిర్మాణం చేపడతామని ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా కల్పించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరికి గృహాలు మంజూరు కావని అనహరులకు ఇల్లు మంజూరు అయితే వేటు వేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలు కు చెందిన కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్త లు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment