హిందువులపై ఉగ్రవాదుల చర్యలు సహించేదిలేదు
– ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేయాలి
– బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం
– ములుగులో తీవ్రవాదుల దిష్టిబొమ్మ దహనం
ములుగు, తెలంగాణజ్యోతి: కాశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్ర వాదుల దుశ్చర్యలు సహించలేనివని, హిందువులను అతి కిరాతకంగా హతమార్చిన వారిని ఎన్కౌంటర్ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం కేంద్రాన్ని కోరారు. కాశ్మీర్లో టూరిస్టులను చంపినందుకు నిరసనగా ములుగులోని జాతీయ రహదారిపై బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ దక్షిణకాశ్మీర్లోని పహల్గామ్ లో ముస్లింలు లేరని తనిఖీ చేసిన తర్వాత ఇస్లామిక్ ఉగ్ర వాదులు పర్యాటకుల ఐడి కార్డులు చూసి, ఇంకా నిర్ధారణ కోసం వారి ప్రైవేటు పార్ట్స్ ను చూసి మరీ నిర్ధారించుకొని వాళ్లను కాల్చి చంపేయడం అత్యంత పాశవిక చర్య అన్నారు. దేశంలో కొందరు హిందువులపై దాడులు జరిగితే స్పందించరని, అదే పాలస్తీనాలో దాడులు జరిగితే మాత్రం రోడ్డున ఎక్కి ధర్నాలు నిరసనలు చేస్తారని విమర్శించారు. దేశంలో హిందువులపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని, సర్వమత సహనం, లౌకిక వాదం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్లో కొన్ని రోజులుగా హిందువుల మీద దాడులు జరుగుతున్నా వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్పందించకపోవడం దారుణమ న్నారు. సెక్యులరిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు హిందువులను జెండాలు మోసే బానిసలుగానే చూస్తున్నా యన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్క హిందువు సంఘటితమై ఉగ్రవాదుల చర్యలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయం కోసం మన జీవితాలను భవిష్యత్తును నాశనం చేస్తున్నవారిని ఉపేక్షించేదిలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ భూక్యా జవహర్, ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు జినుకల కృష్ణాకర్ రావు, జిల్లా కోశాధికారి గంగిశెట్టి రాజ్ కుమార్, ములుగు మండలం అధ్యక్షుడు రాయంచు నాగరాజు, ప్రధాన కార్యదర్శి బైకాని మహేందర్, ఉపాధ్యక్షులు హేమాద్రి, నాయకులు పాపిరెడ్డి, అల్లె శోభన్, రఘుపతి, మూడు రాజు నాయక్, తంగళ్ల పల్లి శ్రీధర్, దాసరి వెంకటేష్ యాదవ్, కల్లెడ ప్రవీణ్, రాకేష్, నరేష్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.
ఉగ్రమూకల దాడిలోని మృతులకు నివాళి
ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు రాయంచు నాగరాజు ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన హిందువుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులర్పించారు. ఉగ్రవాదులను ఏరివేయాలని, కేవలం హిందువులే టార్గెట్ గా దాడి చేయడం వెనుక ఉన్న వారిని గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇటు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో సైతం నిరసనల పేరుతో హిందువులపై దాడులు చేయడం దారుణమన్నారు. ప్రతీ ఒక్కరూ జరుగుతున్న కుట్ర లను గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, భూక్య జవహర్లాల్, కొత్త సురేందర్, సూర్య దేవర విశ్వనాథ్, హేమాద్రి, జినుకల కృష్ణాకర్ రావు, పాపిరెడ్డి, రాజ్ కుమార్, వాసుదేవరెడ్డి, కొండారెడ్డి, వెంకట్ రెడ్డి, భిక్షుగౌడ్, గాదం కుమార్, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు కొండి సాంబశివ, ఆవుల వెంకన్న, రమణారెడ్డి, చుంచు రమేష్, కొండ్ల శ్రీనివాస్, రాజేందర్, గంగిశెట్టి శ్రీనివాస్, తమ్మిశెట్టి కేదారి, గర్రెపెల్లి దేవేందర్, మహేందర్, కట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.