కాలేశ్వరంలో అభివృద్ధి పనుల కు మే 10 డెడ్ లైన్

కాలేశ్వరంలో అభివృద్ధి పనుల కు మే 10 డెడ్ లైన్

కాలేశ్వరంలో అభివృద్ధి పనుల కు మే 10 డెడ్ లైన్

కాటారం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాలేశ్వరం లో మే 15 నుండి 26వ తేదీ వరకు జరిగే సరస్వతి పుష్కరాల కోసం జరుగుతున్న అభివృద్ధి పనులను మే 10వ తేదీ లోపు పూర్తి చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఆదేశించారు. బుధవారం కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కర పనులను సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ శ్రీమతి అలేఖ్య పుంజాల, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే జిల్లా అధికారుల తో కలసి విఐపి ఘాట్, సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు, 100 గదుల సత్రం అభివృద్ధి పనుల పనితీరును పరిశీలించారు. అభివృద్ధి పనులు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియ మించాలని, పనులను క్యాజువల్ గా తీసుకోవద్దని సీరియస్ గా తీసుకుని పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను, కాంట్రాక్టర్లు ను ఆదేశించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమా వేశంలో శాఖల వారిగా చేపట్టున పనుల ప్రగతిని పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు పూర్తి చేయుటపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న 10 రోజులు చాలా ముఖ్యమని తెలిపారు. ప్రతి రోజు పనులలో ప్రగతి రావాలని ఆదేశించారు. ప్రతి రోజు పనుల ప్రగతి, పనులు వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేయాలని సూచించారు.సరస్వతి విగ్రహం ఏర్పాటు మే మొదటి వారం వరకు పూర్తి చేయాలని దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సమయం సమీపిస్తు న్నదని పనుల్లో వేగం పెంచాలని, రేయింబవళ్లు పనులు జరిగితే తప్ప పనులు పూర్తి కావని, ఆశించిన స్థాయిలో వేగంగా పనులు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మే మొదటి వారం వరకు 7 హారతి ప్లాట్ ఫార్మ్స్ కుడా పూర్తి చేయాలని తెలిపారు. ఘాట్, సరస్వతి విగ్రహం, సత్రం పనులు, సాంస్కృతిక కార్యక్ర మాలు తదితర పనులు పర్యవేక్షణకు జిల్లా అధికారులను ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా నియమించి నిరంతరం పను లను పర్యవేక్షణ చేయు విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. మే 10వ తేదీ వరకు అన్ని పనులు పూర్తి కావాలని, ఇంజినీరింగ్ అధికారులు పనులు పూర్తి చేయుటకు టైం షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంతో ప్రతిష్టా త్మకంగా జరుగుతున్న కార్యక్రమమని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని అన్నారు. విఐపి ఘాట్ వద్ద శాశ్వత మరుగుదొడ్లు, షవర్స్, భక్తులు బట్టలు మార్చుకునే గదులు 12 వ తేది వరకు ఫుల్ షేప్ లో పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. భక్తులు నది వరకు వెళ్ళడానికి అనువుగా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని, వేసవి దృష్ట్యా నదిలోకి భక్తులు వెళ్ళడానికి అనువుగా అనువుగా క్వయర్ మాట్ ఏర్పాటు చేయుటలో అవగాహన లేకుండా ఎందుకు చెప్తున్నారని పీఆర్ ఈఈపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విఐపి ఘాట్ వద్ద అదనంగా తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని ఆర్ డబ్ల్యూఎస్ ఈఈకి సూచించారు. సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తరలించడానికి 4 వాహనాలు సిద్ధంగా ఉంచాలని, గోతిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వేసి పూడ్చాలని సూచించారు. విఐపి ఘాట్ వద్ద లైటింగ్ పనులు 10వ తేదీ వరకు పూర్తి చేయాలని అన్నారు. విఐపి ఘాట్ వద్ద 100 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటుతో పాటు 125 కెవి జనరేటర్ సిద్ధంగా ఉంచాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విఐపి ఘాట్ వద్ద సూచన చేసిన ప్రకారం మొక్కలు నాటాలని మే 10 వరకు పూర్తి చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఘాట్ పైన చలువ పందిళ్లు వేయాలని సూచించారు. ఏదేని సమస్య ఉంటే తెలియ చేయాలని, చెప్పకుండా మీలోనే దాచుకుంటే ఎలా చెప్పండి, సమస్య అలానే ఉంటుంది భక్తులు ఇబ్బందులు పడతారు, అందుకే సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. సమావే శంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ ఆర్జేసి రామకృష్ణ రావు, విద్యుత్తు శాఖ ఎస్ ఈ మల్చూర్ నాయక్, ఇరిగేషన్ ఎస్ఈ సత్యనారాయణ, డిపిఓ నారాయణ రావు, జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్, దేవాదాయ శాఖ ఈఈ కనక దుర్గా ప్రసాద్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈ ఈ నిర్మల, ఇరిగేషన్ ఈఈ తిరుపతి రావు, ధార్మిక అడ్వైజర్ గోవింద రాజు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment