విద్యార్థులు నిర్దేశిత లక్ష్యాలతో ముందుకు సాగాలి
– పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే సత్యనారాయణ రావు
కాటారం, తెలంగాణ జ్యోతి : విద్యార్థులు నిర్దేశిత లక్ష్యాలను ఎంచుకొని ఉన్నత చదువులు చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్య నారాయణ రావు ఉద్ఘాటించారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ప్రాథమికొన్నత పాఠశాల, గణపురం మండలంకేంద్రంలోని మోడల్ స్కూల్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన పాఠశాలల వార్షికోత్సవ వేడుకల్లో భూపా లపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. విద్యార్థుల నృత్యాలు, కోలాటాలు చాలా ఆకర్షించాయి. ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఎం ఎల్ ఏ మాట్లా డుతూ ప్రతీ ఏడాది పాఠశాలల్లో నిర్వహించే వార్షికోత్సవాలు బడి పట్ల విద్యార్థుల్లో నమ్మకం, విశ్వాసాన్ని నింపుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రులతోడ్పాటు ఉంటే అద్భుతాలను సృష్టిస్తారన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ప్రతీ రోజు కొంత సమయం కేటాయించి, వారితో విద్యాపరమైన సామాజిక అంశాలపై చర్చించడం ద్వారా వారిలో భయం పోతోందన్నారు. చదవుతో పాటు ఆటపాటలు కూడా చాలా అవసరం అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. ప్రతి విద్యార్థి తమ లక్ష్యాలను ఎంచుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరారు.విద్యార్థుల కళా ప్రదర్శన అద్భుతంగా ఉందని అన్నారు.చెల్పూర్ పాఠశాలలో వాష్ రూమ్స్ మరియు పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఘనపూర్ మండలం మోడల్ పాఠశాలలో డైనింగ్ హాల్, సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయిస్తానని అన్నారు. పోటీ పరీక్షలో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఎమ్మెల్యే ఉపాధ్యాయులను శాలువాతో సన్మానం చేశారు. అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, మండల ఎంపిడిఓ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.