రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ
ఏటూరునాగారం,తెలంగాణజ్యోతి:ములుగుజిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు చలో వరంగల్ బి.ఆర్.ఎస్ పార్టీ (25) రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్ ను మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలోని పాలకులు తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక తనకున్న అన్ని పదవులకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 లో కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారన్నారు. టిఆర్ ఎస్ 14 సంవత్సరాల పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిం దన్నారు. 10 సంవత్సరాల తెలంగాణ సుభిక్ష పాలన చేసిన నాయకుడు తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో ఈనెల 27 న వరంగల్ ఎల్కతుర్తిx రోడ్డులో జరిగే 25 సంవత్సరాల రజతోత్సవ సభకు సబండ వర్గాల ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, ఎండి ఖాజా పాషా, కూనూరు అశోక్ గౌడ్, తాడూరి రఘు, మాజీ ఎంపీపీ అంతటి విజయ నాగరాజు, దున్నపునేని కిరణ్, జాడి బోజారావు, బాస పుల్లయ్య, ఈసం స్వరూప, గండేపల్లి నర్సయ్య, కాళ్ల రామకృష్ణ, వావిలాల పోశయ్య, మాజీ సర్పంచ్ దొడ్డ కృష్ణ, మెరుగు వెంకటేశ్వర్లు, దేపాక శ్రీరామ్, బండి లక్ష్మి, మందపల్లి చంద్రం మల్యాల లక్ష్మయ్య, వావిలాల కిషోర్, బాలయ్య, మిట్ట కంటి సమ్మి రెడ్డి, దడిగల లక్ష్మణ్, లొట్ట పెట్టల రాజేష్, తదితరులు పాల్గొన్నారు.