కర్రెగుట్టలు చుట్టుముట్టిన భద్రత బలగాలు
– అడవుల్లోకి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరికలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : ఆపరేషన్ కగార్ పేరుతో గత మూడు రోజులుగా భద్రతా బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టాయి. సుమారు 250 కిలోమీటర్ల పైగా విస్తరించి ఉన్న కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో తలదాచుకున్నారని ఇంటెలిజెన్స్ సమాచారంతో భద్రత బలగాలు పెద్ద సంఖ్యలో అడవిని జల్లెడ పడుతున్నాయి. ఈ మేరకు ములుగు జిల్లా వెంకటాపురం, మండల కేంద్రంలోని హెలిపాడ్ లొ హెలికాప్టర్లు దిగి కర్రెగుట్టలలో రేయింబవళ్లు కూంబింగ్ నిర్వహి స్తున్న పోలీసులకు ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లు, మెడిసిన్లు హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్టు సమాచారం. ఒకపక్క హెలికాప్టర్లు, మరోపక్క పోలీసు బలగాలతో వెంక టాపురం, వాజేడు, చర్ల ప్రాంతాల ప్రజలు భయాంధోళనలు వ్యక్తం చేస్తున్నా రు. ఏజెన్సీలో హై అలర్ట్ కొనసాగుతుండగా అడవుల్లోకి ఎవరు వెళ్లొద్దని హెచ్చరికలను పోలీసులు జారీ చేస్తున్నారు.