27 న భూపాలపల్లిలో మెగా జాబ్ మేళా
– ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు
– భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి(కాటారం), తెలంగాణజ్యోతి: భూపాలపల్లి జిల్లా కేంద్రం లో ఈ నెల 27వ తేదీన పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో జరిగే మెగా జాబ్ మేళా కార్యక్రమానికి వచ్చే యువతకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, పంచా యతి రాజ్, పరిశ్రమలు, వైద్య, విద్య, ఆర్టిఓ, సింగరేణి, జెన్కో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి సుమారు పదిహేను వేల మంది నిరుద్యోగ యువత జాబ్ మేళాకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో తగు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. సత్యనారాయణ రావు వివిధ శాఖల జిల్లా అధికారులకు కీలక సూచనలు చేశారు. ఏర్పాట్లుపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా 7,624 మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. గ్రామాల నుండి జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి రవాణా సౌకర్యం ఏర్పాటు తో పాటు మంచి నీరు, మజ్జిగ, అల్పాహారం తదితర ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్ప గ్రాండ్ లో మంచినీరు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని సింగరేణి జీఎంకు సూచించారు. ఎందరో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ మహోన్నత కార్యక్ర మాన్ని ప్రతి ఒక్కరూ తమ సొంత కార్యక్రమంగా భావించి అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఉపాధి లభించక చదువుకున్న యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని వారిని సన్మార్గంలో నడిపంచాల్సిన భాద్యత మనందరిపై ఉందని, యువత ఉపాధి అవకా శాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం అవుతారని సూచించారు. వేసవి దృష్ట్యా అత్యవసర మందులు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, అంబులెన్స్ ఏర్పాటుతో పాటు ప్రధాన ఆసుపత్రిలో అత్యవసర బెడ్లు అందుబాటు లో ఉంచాలని వైద్యాధికారులకి సూచించారు. కొంత మంది ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోలేని వారి కోసం అదే రోజు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించి నట్లు తెలిపారు. అందుకు కంపెనీల వారీగా ఖాళీలను తెలిపే విధంగా పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. టాస్క్ కంపెనీ ప్రతినిధులు ఒకరోజు ముందుగానే హైదరాబాద్ నుండి భూపాలపల్లికి వచ్చే అవకాశం ఉన్నందున సింగరేణి, జెన్కో అధికారులు వారికి వసతితో పాటు భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. 87 కంపెనీలు వస్తున్నట్లు సమాచారం ఇచ్చారని, పెరిగే అవకాశముందని తగినట్లు ఏర్పాట్లు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. జాబ్ మేళా విజయవంతానికి గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, మండల స్థాయిలో ఎంపీడీవో, ఎమ్మార్వో, జిల్లా స్థాయిలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ కన్వీనర్ గా ఉంటా రన్నారు. మనందరం సమష్టి బాధ్యతగా సమన్వయం చేసుకుంటూ ఇట్టి జాబ్ మేళాను విజయ వంతం చేయాల ని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదన పు కలెక్టర్ విజయలక్ష్మి, సింగరేణి జిఎం రాజేశ్వరరెడ్డి, జెన్కో సీఈ శ్రీ ప్రకాశ్, డిపిఓ నారాయ ణరావు, డిఆర్డీఓ నరేష్, జిల్లా వైద్యాధికారి డా మధు సూదన్, పరిశ్రమల జిఎం సిద్దార్థ, క్రీడల అధికారి రఘు, ఆర్టిఓ సంధాని, డీఈవో రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.