ప్రముఖ రైతు, పురప్రముఖులు శ్యామ రామారావు మృతి. 

ప్రముఖ రైతు, పురప్రముఖులు శ్యామ రామారావు మృతి. 

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన పుర ప్రముఖులు రైతు శ్యామా రామారావు అనారోగ్యంతో గురువారం ఉదయంవారిస్వగ్రుహంలో మ్రుతి చెందారు. దానవైపేట,మరికాల వ్యవసాయ క్షేత్రాలు కలిగిన ఆయన అనేక పంటలను సాగు చేసి అధిక దిగుబడులు సాధించి, రైతు సోదరులకు ఆదర్శంగా , రైతు ప్రముఖులుగా పేరుగాంచిన ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా అనేకమంది ప్రముఖులు, కాపు సంఘాలు, రైతు సంఘాలు, రైతులు,కార్మికులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. మ్రుదు స్వభావి , అందరి నోరార పలకరించే, శ్యమా రామారావు వ్యవసాయ రంగంలో, తోటి రైతులు, వ్యవసాయ కూలీలతో కలిసిమెలిసి ఉండి, మంచి మనిషిగా పేరుగాంచిన ఆయన మృతి పట్ల, పలువురు సంతాపం తెలుపుతూ, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment