తెలంగాణ రాష్ట్రంపై ఎప్పుడూ విషం చిమ్ముతున్న ప్రదాని మోడీ
– ప్రధాని అన్ని రాష్ట్రాలకా.. లేక కొన్ని రాష్ట్రాలకేనా?
– తెలంగాణ ప్రజలు అంటే ఎందుకింత కక్ష
– ఉత్తర తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పీక కిరణ్ ధ్వజం
కాటారం ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపారని, నరేంద్ర మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రధాన మంత్రా.. లేక కొన్ని రాష్ట్రాలకేనా.. అని ఉత్తర తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పీక కిరణ్ ధ్వజమెత్తారు. బుధవారం కాటారంలో పత్రిక విలేకరుల సమావేశంలో కిరణ్ మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు తిరస్కరించిన బలహీన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ తన కుర్చీని కాపాడుకునేందుకు కొన్ని రాష్ట్రాల సీఎంలకు భయపడి ఆ రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయిస్తున్నార న్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిజెపి పార్టీకి 8 ఎంపీ సీట్లు ఇవ్వగా, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ పేరు పలకకపోవడం, చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. స్వదేశీ, విదేశీ సంస్థల కోసం కార్పొరేట్ పన్నులు భారీగా తగ్గించబడ్డాయని, అయితే, వ్యవసాయ ఉత్పత్తులకు ఎం ఎస్ పీ యొక్క చట్టపరమైన హామీ ఇప్పటికీ సుదూర కలగానే మిగిలందని వాపోయారు. రక్షణ రంగానికి రూ. 4,54,773 కోట్లు కేటాయించగా, వ్యవసాయం మరియు విద్యా రంగానికి వరుసగా 1,51,851 కోట్లు మరియు 1,25,638 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే కొత్త ఉపాధి నైపుణ్య పథకం గురించిన వాగ్దానాలు ఇప్పటికే ఉన్న ‘స్కిల్ ఇండియా’ విఫలమైనట్లు చూపుతున్నాయన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల సృష్టి మోదీ హామీ ఇప్పటికీ అబద్ధాల మాటలుగానే మిగిలిపోయిందని వారు ఆరోపించారు. ప్రభుత్వ రంగాలు, పబ్లిక్ సెక్టార్ లలో దాదాపు 30 లక్షల ఖాళీలను భర్తీ చేయడం గురించి ప్రస్తావించలేదన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందన్నారు. అదే విధంగా ఇటీవలి కాలంలో వరుస ప్రమాదాలు జరిగినా బడ్జెట్లో రైల్వే భద్రత గురించి ప్రస్తావించలేదన్నారు. మొత్తానికి ఈ బడ్జెట్ యువత, విద్యార్థి వ్యతిరేకం, ప్రజావ్యతిరేకమైనదని అన్నారు. కేవలం భాజపా కార్పొరేట్ మాస్టర్లకు మాత్రమే ఉపయోగప డుతుందని పీక కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో యు వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు, నాయక పోడు సేవా సంఘం జిల్లా నాయకులు దయ్యం పోచయ్య తదితరులు పాల్గొన్నారు.