Nitin Gadkari |  మేడారానికి నేషనల్ హైవేల అనుసంధానం

Nitin Gadkari |  మేడారానికి నేషనల్ హైవేల అనుసంధానం

Nitin Gadkari |  మేడారానికి నేషనల్ హైవేల అనుసంధానం

– రహదారుల నిర్మాణంపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ

– ఆదిలాబాద్ జిల్లాలో నేషనల్ హైవే పనులు ప్రారంభం

– కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ

ఆసిఫాబాద్ ప్రతినిధి, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లాలో ని ఆధ్యాత్మిక స్థలమైన మేడారాన్ని నేషనల్ హైవేలతో అనుసం ధానిస్తామని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అలాగే భద్రాచలం, బాసరకూ హైవేలను అనుసం ధానిస్తామని హామీ ఇచ్చారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో సోమవారం ఆయన పలు జాతీయ రహదారు లను ఆయన ప్రారంభించి, మరో రూ.3,900 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన సభలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోందని చెప్పారు. రహదారులు మెరుగ్గా ఉండే దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా భావించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, ఉపాధి, రవాణ, మౌలిక వసతులు అనే 4 అంశాలు దేశాభి వృద్ధిని నిర్దేశిస్తాయన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టు బడి ఉందని తెలిపారు. “రాష్ట్రాల మధ్య అనుసం ధానం పెంచేందుకు కీలకమైన ప్రాజెక్టును కేంద్రం చేపట్టిందన్నారు. రోడ్డు కనెక్టివిటీలో భాగంగా క్లిష్టమైన వంతెనలు, సొరంగ మార్గాలు నిర్మిస్తున్నామన్నారు. జోజిలా పాస్ టన్నెల్ వంటి నిర్మాణాలను చేపట్టామని, సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించనున్నామన్నారు. నాగ్పుర్ నుంచి విజయ వాడ కారిడార్ చేపట్టామని, తెలంగాణ- మధ్య రోడ్డు కనెక్టివిటీ మరింత పెరగనుందన్నారు. భద్రాచలం, బాసర, మేడారం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని, జగిత్యాల – కరీంనగర్ హైవే విస్తరణ పనులను త్వరలోనే చేపడతానన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఎన్నో ప్రాజెక్టులు చేపట్టామని, హైదరాబాద్ అంబర్ పేట్లో నిర్మించిన పైవంతెనను ప్రారంభించు కోనున్నామ న్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. పెట్రోల్ వాహనా లకు బదులు గా విద్యుత్ వాహనాలు ఇంకా పెరగాలి. వీటితో రవాణా ఖర్చు బాగా తగ్గుతుందని నితిన్ గడ్కరీ తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment