E FORMER | జిల్లాలో ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నామమాత్రం
– ఏ ఈ ఓ లకు కొత్త సిమ్ కార్డు పంపిణీలో ఆలస్యం
– పైలెట్ మండలానికి పరిమితమైన రైతు అవగాహన సదస్సులు
కాటారం, తెలంగాణ జ్యోతి : వ్యవసాయ శాఖలో ఖరీఫ్ ప్రారంభానికి ముందు రెండు కీలకమైన కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈనెల 5 సోమవారం నుండి ఫార్మర్ రిజిస్ట్రేషన్, వానాకాలం సాగు కోసం నూతన వ్యవ సాయ పద్ధతులు, సాగు విషయాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూభారతి లో పైలట్ మండలంగా ఎంపికైన రేగొండ మండలంలో మాత్రమే శాస్త్రవేత్త లు రైతులకు అవగాహన సదస్సులు ప్రారంభించారు. ప్రధాన పథకాలపై జిల్లా వ్యవసాయ శాఖలో సమన్వయం కొరవడింది. పర్యవేక్షించాల్సిన జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ శాఖలో ఏప్రిల్ నెలలో జిల్లా మండల, గ్రామ స్థాయి అధికారుల మొబైల్ పోర్టబిలిటీలో భాగంగా సెల్ నెంబర్ లన్ని మారిపో యాయి. వ్యవసాయ శాఖలో క్షేత్రస్థాయిలో కీలకంగా ఉన్న ఏ పీ ఓ లకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సిమ్ కార్డులు పంపిణీ చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ లకంగా ప్రవేశపెట్టిన ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జిల్లాలో అంతట ప్రారంభం కాలేదు. జిల్లాలోని టేకుమట్ల మండలంలో లాంచనంగా ప్రారం భించారు పంపిణీ చేయని కారణంగానే జిల్లాలో ఈ ఫారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ సకాలంలో ప్రారంభం కాలేదని ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకం అమలు పై నిర్లక్ష్యం ఆవహించుకోవడం డొల్లతనాన్ని తెలియజేస్తోంది. కొత్తగా ఒకరిద్దరికి పంపిన చేసిన సిమ్ కార్డుల ఆధారంగా ఏఈవోలు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
భూమి ఉన్న ప్రతి రైతుకు గుర్తింపు నెంబరు
ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆధార్ తో దేశంలోని ప్రతి పౌరుడికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు 11 అంకెలతో కూడిన విశిష్ట సంఖ్య ని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసా యశాఖ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలని సంకల్పం తో కేంద్రం ముందుకు సాగుతుండగా జిల్లాలో ప్రాజెక్టును చేపడుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా భూమి ఉన్న ప్రతి రైతుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కింద నమోదు చేస్తారు పీఎం కిసాన్ లబ్ధిదారులకు తరువాత విడతలో లబ్ధి పొందేందుకు ప్రామాణికంగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది ఇందులో భాగంగా రైతు ఫార్మర్ ఐడి ని పొందేందుకు ఆధార్ కార్డు భూ యాజమాన్య పాస్ పుస్తకం ఆధార్కు లింకు చేయబడిన మొబైల్ నెంబర్తో సమీపంలోని రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదిస్తే ఐడి నెంబర్ కేటాయిస్తారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలకు కొలమానం
వీరునాయక్ : జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
భూమి కలిగిన ప్రతి రైతుకు ఐడి కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందుకు అనుగుణంగా ఆధార్ కార్డు సలహాలు 11 అంకెలతో కూడిన గుర్తింపు సంఖ్యను ప్రతి రైతుకు అందిస్తాం. ఈ ఫారం రిజిస్ట్రేషన్ పై ఇప్పటికే ఏవోలు, ఏఈఓ లకు శిక్షణ ఇచ్చాం. రైతుల నుంచి వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభమైంది. దీన్ని రైతులు సద్వినియోగం చేసు కోవాలి. దూర ప్రాంతాల్లో ఉన్న రైతులు సైతం తమ సమాచారాన్ని ఏఈఓ లకు తెలియజేసి నమోదు చేసుకొని గుర్తింపు సంఖ్యను పొందాలి. ఇది భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భూభారతిలో పైలట్ మండలంగా ఎంపికైన రేగొండ మండలంలో శాస్త్రవేత్తలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు రైతులకు ఈ అవగాహన సదస్సులు ఉపయోగకరం కానున్నాయి.