సరస్వతీ పుష్కరాలకు సీఎం ను ఆహ్వానించిన మంత్రులు
కాటారం, తెలంగాణ జ్యోతి : కాలేశ్వరం లో ఈనెల 15 నుండి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్న సరస్వతి నది పుష్కరాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర మంత్రులు ఆహ్వానించారు. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సరస్వతి పుష్కరాలకు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దుద్దిల్ల శైలజా రామయ్యర్ లు కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.