మొక్కజొన్న రైతులకు న్యాయం చేయకుంటే.. ప్రగతి భవన్ ను ముట్టడి చేస్తాం…

మొక్కజొన్న రైతులకు న్యాయం చేయకుంటే.. ప్రగతి భవన్ ను ముట్టడి చేస్తాం...

మొక్కజొన్న రైతులకు న్యాయం చేయకుంటే.. ప్రగతి భవన్ ను ముట్టడి చేస్తాం…

– ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి..

– రోడ్డు పై బైఠాయించిన మొక్క జొన్న రైతులు..

– ఏడువందల మంది రైతు లు రెండు గంటల పాటు రాస్తారోకో..

– నష్టపరిహారం అందకుండా ఆర్గనైజర్లే అడ్డుకుంటున్నారని మండిపాటు..

– ఆర్గనైజర్ల పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..

– చనిపోయిన రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేసీయా చెల్లించచాలి..

– ఆందోళనకు జి ఎస్పీ, గిరిజన సంఘం మద్దతు..

వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి : బహుళజాతి కంపెనీకి చెందిన మొక్కజొన్నలు వేసి నష్టపోయిన తమకు న్యాయం చేయకుంటే ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి ప్రభుత్వన్నా హెచ్చరించారు. మంగళవారం వాజేడు ఎన్.హెచ్. పూసూరు గోదావరి బ్రిడ్జి వద్ద ఏడువండల మంది కీ పై గా మొక్క జొన్న రైతులు జాతీయ రహదారిపై రెండు గంటల పాటు భైఠయించారు. నష్టపోయిన రైతులకు ఇస్తానన్న నష్టపరిహారం ఇవ్వకుండా కంపెని ఆర్గనైజర్లు, కంపెనీ ఉద్యోగులు, అడ్డుపడు తున్నారని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి ఆరోపించారు. డెబ్భై రోజుల నుండీ ఏజెన్సీ రైతులు ఆందోళన చేస్తూ ఉంటే నష్టపరిహారం ఇస్తామని తాత్సరం చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ కమిషన్ చైర్మన్ కొందండ రెడ్డి ముందు హైటేక్, సింజెంట, మొన్సెంట, బెయర్ కంపెనీల ఆర్గనైజర్లు, కంపెనీల ఉద్యోగులు రైతులకు అణా పైసా కూడా పెట్టుబడి ఇవ్వలేదని చెప్పారని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్గనైజర్లకు మనీ ల్యాండరింగ్ నోటీసులు ఇస్తే ఏ ఒక్క రైతుకు అప్పులు ఇవ్వలేదని వివరణ ఇచ్చారని అన్నారు. నష్టపరిహారం చెల్లిస్తానని ఆర్గనైజర్లు, కంపెనీ ప్రొడక్షన్ మేనేజర్లు ఒప్పుకొని జిల్లా కలెక్టర్ ముందు సంతకాలు పెట్టారని తెలిపారు. సుమారు పదిహేడు కోట్ల రూపాయలు చెల్లించనున్నట్లు కంపెనీలు తెలిపా యని, ఎకరం సాగు చేసిన రైతు పైన డెబ్భై వేల రూపాయలు పెట్టుబడి పెట్టినట్టు, హైటేక్ కంపెనీ ప్రొడక్షన్ మేనేజర్ ఒక తప్పుడు నివేదికను కలెక్టర్ కు సమర్పించినట్టు వివరించారు. కానీ బ్యాంక్ ఖాతా నుండీ ఒక్కో ఎకరానికి రైతుకు ఆర్గనైజర్ చెల్లించింది ఇరవై నుండీ ముప్పై వేల రూపాయలు మాత్రమే నని, రైతుల బ్యాంక్ ఖాతాలను పరిశీలించడం ద్వారా కలెక్టర్ గుర్తించరాని ఆయన పేర్కొన్నారు. ఆర్గనైజర్లు జిల్లా కలెక్టర్ ని, వ్యవసాయ అధికారులను రాజకీయ ఒత్తిడులకు గురి చేసి వాళ్ళపని వారు చేసుకోకుండా అడ్డు పడుతున్నారని అన్నారు. ఏ, బి, సి గ్రేడ్లు రద్దు చేసి అందరికి ఒకే గ్రేడ్ ఇచ్చి ఎకరానికి ఎనభై ఐదు వేల రూపాయలు కంపెనీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కంపెనీ ఆర్గనైజర్ల పైన బలమైన కేసులు పెట్టక పోవడం కారణంగానే బయట ఉండి, అధికారులను, రైతులను ఇబ్బందు లకు గురి చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పైన రైతులు నమ్మకం పెట్టుకొని ఉన్నారని అన్నారు. కంపెనీ ఆర్గనైజర్ల దుశ్చర్యల తో రైతుల ఆశలు ఆడిఆశలు అయ్యాయాని రైతులు వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ప్రాజెక్ట్ అధికారిని చిత్ర మిశ్రా రావా లని రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రెండు గంటలైనా అధికారులు ఎవరు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, లేవాలని పోలీస్ అధికారులు వెంకటాపురం సి.ఐ బండారి కుమార్, వాజేడు, వెంకటాపురం ఎస్సై లు కొప్పుల తిరుపతి రావు, రైతులను బలవంతంగా లేపే ప్రయ త్నం చేశారు. రైతులు ఎమ్మెల్యే వచ్చేదాకా లేసేది లేదన్నారు. చివరికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఫోన్ ద్వారా రైతులతో మాట్లాడి వారం రోజుల్లో రైతులకు నష్టపరిహారం చెల్లించేలా చూస్తానని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో రైతులకు పరిహారం చెల్లించకపోతే ప్రగతి భవన్ ని ముట్టడి చేస్తామని రైతులు హెచ్చరించారు. రేపు వెంకటాపురం వస్తానని వచ్చిన తర్వాత రైతులతో అన్ని విషయాలు మాట్లాడి నష్టపరిహారం అందేలాగా చూస్తానని హామీ ఇవ్వడం తో రైతులు ధర్నా విరమించారు. రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి జి ఎస్పీ జిల్లా అధ్యక్షులు పూనెం ప్రతాప్, గిరిజన సంఘం నాయ కులు జెజ్జరీ దామోదర్, మద్దతు ప్రకటించారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని తెలిపారు. ఈ రాస్తారోకో కార్యక్రమంలో ఏఎన్ఎస్ నాయకులు మోడెం నాగ రాజు, కుంజ మహేష్, రైతు నాయకులు పాయం రాంబాబు, నాగుల ప్రవీణ్, చేలే రాజేష్, జాడి ఈశ్వర్, సాంబ మూర్తి, రెండు మండ లాల మొక్కజొన్న రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment